Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరమట..

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (15:54 IST)
దేవుళ్లకు అరటి, కొబ్బరికాయలను మాత్రమే సమర్పించాలి. భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నా అరటిపండు, కొబ్బరికాయలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటికి పూర్ణఫలాలు అని పేరుంది. దానికి కారణం సృష్టిలో ఉన్న ఏ ఇతర ఫలాన్నైనా మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటిలో నుండి ఉమ్మేస్తాం. 
 
దాని వలన విత్తనాలు ఎంగిలిపడతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి, తిరిగి పుష్పించి పండ్లను కాస్తాయి. ఆ పండ్లను మనం దేవునికి నైవేద్యంగా పెడతాం. ఇది అంత శ్రేష్టం కాదు. ఐతే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరుగదు. అరటిచెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది. 
 
కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం అంటదు. అందుకే అరటి పండు, కొబ్బరికాయలు పూర్ణఫలాలయ్యాయి. విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. అందువల్ల ఈ దేవుళ్లను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments