Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళని దండాయుధ పాణి ఆలయంలో కుంభాభిషేకం (video)

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (14:02 IST)
Palani kumbabishekam
పళని దండాయుధ పాణి ఆలయంలో జనవరి 27న కుంభాభిషేకం అట్టహాసంగా జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగింది. దండాయుధపాణి స్వామి ఆలయం తమిళనాడు దిండుక్కల్ జిల్లాలోని పళనిలో ఉంది. కుమార స్వామి ప్రతిష్టాత్మక ఆరు క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలోని మూలవిరాట్టు నవపాషాణంతో రూపుదిద్దుకుంది.
 
పాదవినాయకుడు, క్షేత్రపాలకులు, 5 నెమలి విగ్రహాలు, మెట్ల దారి క్షేత్రాలు, వినాయగర్ విగ్రహాలు, ఇడుంబన్, కడంబన్, అగస్త్యుడు, సర్ప వినాయకుడు, జంట వినాయకుల విగ్రహాలకు కుంభాభిషేకం జరుగనుంది. 
 
ఈ పళని ఆలయంలో 16 ఏళ్ల తర్వాత 27వ తేదీన కుంభాభిషేకం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య రాజగోపురం, స్వర్ణ విమానానికి తీర్థ అభిషేకం, అనంతరం స్వామివారికి కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 
Palani kumbabishekam
 
కుంభాభిషేకం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు 8వ యాగశాల పూజలు ప్రారంభమయ్యాయి. కుంభాభిషేకం సందర్భంగా దీపారాధన అనంతరం రాజగోపురంతో పాటు ఆలయ సముదాయం అంతటా హెలికాప్టర్‌లో పుష్పయాగం నిర్వహించారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రైవేట్ హెలికాప్టర్‌ను రప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

లేటెస్ట్

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

తర్వాతి కథనం
Show comments