జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం?

Webdunia
ఆదివారం, 31 మే 2020 (09:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్డౌన్ మే 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ లాక్డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చింది. అలాగే, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను జూన్ ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం కూడా జూన్ 8 తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తోంది. 
 
ఇందుకోస తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోనుంది. 
 
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Holiday: మహాశివరాత్రి మరుసటి రోజు సెలవు.. జాగరణ చేసి రెస్ట్ తీసుకోవచ్చు

రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం

ఆర్థిక సర్వే: నివసించడానికి ఉత్తమ నగరాలు-తిరుపతి, వైజాగ్‌లకు స్థానం

అమరావతి ఆర్థిక ప్రాంతం కింద 9 జిల్లాలు.. పౌరులకు గుడ్ న్యూస్

విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే బడ్జెట్ : మంత్రి నాదెళ్ల మనోహర్

అన్నీ చూడండి

లేటెస్ట్

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

10-02-2026 మంగళవారం ఫలితాలు - ఆలోచించి ముందుకు సాగండి.. ఒత్తిళ్లకు గురికావద్దు...

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

తర్వాతి కథనం
Show comments