Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (13:53 IST)
జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగనుంది. సాధారణంగా సంక్రాంతి, దీపావళి ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగుతుంది. 
 
అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 27న ఆలయాన్ని శుద్ధి చేసే ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగబోతోంది. ప్రతిగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మూలవిరాట్టుకు పట్టువస్త్రం కప్పుతారు. గర్భగుడి, ఆనంద నిలయం, ధ్వజ స్తంభం, యోగ నరసింహ స్వామి, వకుళమాత వంటి పుణ్యక్షేత్రాలు, సంపంగి మండపం, రంగనాథ మండపాలతో పాటు ఆలయ శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పచ్చకర్పూరం, పసుపు వంటి వివిధ మూలికా పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయం అంతటా చల్లడం చేస్తారు. 
 
ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా దర్శనానికి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో 5 గంటల పాటు దర్శనం నిలిచిపోనుంది. కాగా గురువారం 63,145 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 22,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

తర్వాతి కథనం
Show comments