Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి వద్ద ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే తిరుమల కొండపైకి ఎంట్రీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (19:57 IST)
కోవిడ్ కేసులు తగ్గిపోయాయి.. ఇక ఏముందిలే..తిరుమల దర్సనానికి ఇలా వెళ్ళి అలా వచ్చేయవచ్చు అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, రెండు డోస్‌ల సర్టిఫికెట్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ టిటిడి మాత్రం ఆ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.

 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులు తూచా తప్పకుండా ఆ రెండింటిలో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకురావాలని స్పష్టం చేస్తోంది. తిరుపతిలోని అలిపిరి వద్దే ఆ సర్టిఫికెట్లను తనిఖీ చేసి పంపించనున్నారు టిటిడి సెక్యూరిటీ అధికారులు.

 
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి. ఈ విషయాన్ని ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రెండు సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా భక్తులను తిరిగి పంపించేస్తామని స్పష్టం చేశారు.

 
ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు టిటిడి అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments