Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి చెంత అన్నీ తానై పెత్తనం చేస్తున్న ఓ అధికారి.. ఎవరు..?

దాదాపు రెండేళ్ళపాటు స్తబ్దుగా ఉన్న తిరుమల టిటిడి జెఈఓ శ్రీనివాసరాజు మళ్ళీ ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. తిరుమలలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన ఈఓ సింఘాల్‌‍కు తితిదే వ్యవహారాలపై అవగాహన కల్పిస్తూ ఆయనతో చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీస

Webdunia
శనివారం, 27 మే 2017 (13:37 IST)
దాదాపు రెండేళ్ళపాటు స్తబ్దుగా ఉన్న తిరుమల టిటిడి జెఈఓ శ్రీనివాసరాజు మళ్ళీ ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. తిరుమలలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. కొత్తగా వచ్చిన ఈఓ సింఘాల్‌‍కు తితిదే వ్యవహారాలపై అవగాహన కల్పిస్తూ ఆయనతో చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాంబశివరావు బదిలీ తరువాత శ్రీనివాసరాజును గమనించిన వారికి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. 
 
తిరుమల జెఈఓగా విశేషమైన అనుభవం సొంతం చేసుకున్న శ్రీనివాసరాజు గడిచిన రెండేళ్ళలో విధి నిర్వహణలో అంత చురుగ్గా లేరనే చెప్పాలి. సింఘాల్ ముందు ఈఓగా పనిచేసిన సాంబశివరావుతో పొడచూపిన విబేధాల వల్ల ఆయన అలా ఉండిపోయారు. సాంబశివరావు సర్వస్వం తానేగా వ్యవహరించారు. తిరుమలలో జరిగే వారపు సమావేశాల్లోను ఈఓ నేరుగా పాల్గొనడం మొదలుపెట్టడంతో సమీక్షల్లో జెఈఓ కూడా అందరి అధికారుల్లాగే ఒక అధికారిగా మిగిలిపోయారు. సాంబశివరావు, శ్రీనివాసరాజు మధ్య ప్రఛ్ఛన్న యుద్థం జరుగుతోందని తితిదేలో అందరూ బహిరంగానే మాట్లాడుకునేవారు. 
 
దాదాపు 20 రోజుల క్రితం ఈఓగా వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్, సాంబశివరావు తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎవరి అధికారాలు వారు ఉపయోగించుకోండి. అందరూ బాగా పనిచేయాలి... అని అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ అవకాశాన్ని శ్రీనివాసరాజు బాగా వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈఓతో చర్చిస్తూ కీలక నిర్ణయాలూ తీసుకుంటున్నారు. వేసవిలో శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని సాంబశివరావు ఉన్నప్పుడే నిర్ణయం తీసుకుని అమలు చేయడం మొదలుపెట్టారు. 
 
రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24,25తేదీల్లోనూ బ్రేక్ దర్శనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జెఈఓగా ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో తిరుగుతూ భక్తుల అవసరాలు తెలుసుకుంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల తిరుమల పర్యటన విజయవంతం చేశారు. వారపు సమీక్ష సమావేశాలను తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తన అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఈఓకు, జెఈఓలకు మధ్య ఇదే సఖ్యత ఉంటే మంచి ఫలితాలు వస్తానయడంలో సందేహం లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

తర్వాతి కథనం
Show comments