Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేంకటేశ్వరుని కోసం మేల్ ఛాట్ వస్త్రాలు కొనుగోలు చేశారు, ఎలా సాధ్యం?

Webdunia
మంగళవారం, 5 మే 2020 (23:39 IST)
తిరుమల శ్రీవారికి అలంకరించేందుకు 8మేల్ ఛాట్ వస్త్రాలను సేలం నుంచి కొనుగోలు చేశామని, జూన్ నెల వరకు ఇవి సరిపోతాయని తిరుమల టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన సేలంలోని తయారీదారుల నుంచి మేల్ ఛాట్ వస్త్రాలు కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు.
 
శ్రీవారి మూలమూర్తికి అలంకరించేందుకు ప్రత్యేక కొలతలతో ఈ చీరను తయారు చేస్తారని చెప్పారు. సేలంలో మాత్రమే మేల్ ఛాట్ వస్త్రాలను తయారుచేస్తారని, తయారీదారులు ఎంతో నియమనిష్టలతో ఈ పట్టువస్త్రాన్ని రూపొందిస్తారన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో సేలంలో సిద్థమైన 8మేల్ ఛాట్ వస్త్రాలను తిరుమలకు తీసుకురావడం కష్టతరంగా మారిందని చెప్పారు.
 
అయితే టిటిడి బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డి చొరవతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి డిజిపి అనుమతులు తీసుకుని సేలం నుంచి ఈ వస్త్రాలను తిరుమలకు తీసుకొచ్చారని అదనపు ఈఓ తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్సనం నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రస్తుతం 2మేల్ ఛాట్ వస్త్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో టెండరు ద్వారా 8మేల్ ఛాట్ వస్త్రాలను టిటిడి కొనుగోలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments