Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర మీనాక్షి ఆలయంలో బయటపడిన సొరంగం.. నిధులున్నాయట!

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:27 IST)
సుప్రసిద్ధ క్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో గతంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి గుర్తుండే వుంటుంది. అయితే ప్రస్తుతం ఆ ఆలయంలో రహస్య సొరంగం ఒకటి బయటపడింది.


ఆలయం ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుపుతుండగా, ఈ సొరంగాన్ని అధికారులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కింగ్ షెడ్ నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా.. ఈ సొరంగం బయటపడింది. పురాతన స్తూపం, 10 అడుగుల ఎత్తు ఉన్న ఓ మండపం, దాని కింద నుంచి సొరంగ మార్గం వెలుగులోకి వచ్చాయి.
 
ఈ సొంరంగం ఆలయం లోపలి నుంచి ప్రారంభమై.. ఎంతవరకూ వెళ్లిందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాణి మంగమ్మాళ్ దీన్ని నిర్మించి ఉండవచ్చని పురాతన శాస్త్రవేత్తలు అంచనా వేస్తుండగా, ఈ సొరంగంలో భారీ నిధి దాగుందని స్థానికులు చెప్తున్నారు.

సొరంగం బయట పడటంతో తవ్వకాలను అధికారులు నిలిపేశారు. దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సొరంగం రహస్యాన్ని తేల్చే పనిలో పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments