Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసుడు నైవేద్య ప్రియుడు, ఎన్ని వంటలు నైవేద్యమంటే..?

Webdunia
గురువారం, 1 జులై 2021 (17:08 IST)
శ్రీవారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో నైవేద్యంతో సమర్పించేందుకు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. పురాతన కాలం నాటి సాంప్రదాయాన్ని శ్రీవారి ఆలయంలో రెండు నెలల ముందు నుంచి తిరిగి ప్రారంభించింది టిటిడి.
 
ప్రస్తుతం స్వామివారికి సమర్పించే నైవేధ్యానికి ఆర్గానికి పదార్థాలను వినియోగిస్తుండగా భవిష్యత్తులో భక్తులకు అందించే ప్రసాదాలు కూడా ఈ పదార్థాలనే వినియోగించనుంది టిటిడి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడు ఎంతటి భక్తజన ప్రియుడో అంతటి నైవేద్యప్రియుడు. అందుకే శ్రీవారికి ప్రతిరోజు ఆరు సమయాల్లో  నైవేద్యాన్ని సమర్పిస్తారు. వేకువజామున సుప్రభావం మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. 
 
మరే ఆలయంలోను ఇన్ని రకాల ప్రసాదాలు సమర్పించరు. లడ్డు, వడ, అప్పం, దోస, పోలి, చుక్కీలు, పాయసం, మురుకు, జిలేబి, ఇలా ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. పూర్వం స్వామివారికి గోవు ఆధారిత పండించిన పదార్థాలతో నైవేధ్యం సమర్పించేవారు. కాలం క్రమేణా వ్యవసాయ పద్ధతులు మారుతూ వస్తుండడంతో నైవేద్యంలో  వినియోగించే పదార్థాలు కూడా మారాయి.
 
గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాల లభ్యత తక్కువగా ఉండడంతో టిటిడి కూడా ఎరువులతో పండించిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించింది. పూర్తిస్థాయిలో వాటినే వినియోగించడం మొదలుపెట్టింది. స్వామివారికి రామానుజస్వామివారు నిర్ధేశించిన విధంగానే నైవేధ్యం సమర్పణ జరుగుతున్నా గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్ధాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు మాజీ పాలకమండలి సభ్యులు శివకుమార్.
 
గోవు ఆధారిత పంటలతో పండించిన పదార్ధాలతో ప్రయోగాత్మకంగా ప్రసాదాలను తయారుచేసి సమర్పించారు. ప్రసాదం రుచి కూడా గతంలో కంటే బాగా పెరగడంతో మొదటిదశలో భాగంగా స్వామివారికి సమర్పించే నైవేధ్యం పెట్టడానికి వీటిని వినియోగించాలని నిర్ణయించింది టిటిడి. 
 
స్వామవారికి ప్రతినిత్యం 194 కేజీల బియ్యంతో 11 కేజీల రవ్వతో ప్రసాదాన్ని తయారుచేస్తారు. వీటిని ఉచితంగా అందిస్తామంటున్నారు రైతు విజయారావు. అంచెలంచెలుగా శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలను వినియోగించాలని టిటిడి పాలకమండలి తీర్మానం చేసింది.
 
దాతలు కూడా టిటిడి గోవు ఆధారిత పంటతో పండించిన పదార్థాలను విరాళాలుగా అందిస్తున్నారు. కోటి రూపాయలు విలువచేసే 26రకాల పదార్ధాలను దేశవ్యాప్తంగా సేకరించి టిటిడికి అందజేశారు చిన్నజియ్యర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు. స్వామివారికి ఆరునెలల పాటు నైవేధ్యం సమర్పించే వస్తువులను అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments