Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్నకు రూ. 1,11,11,111 విరాళం.. ఇచ్చిందెవరో తెలుసా?

జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:29 IST)
జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ జియో.. కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ శ్రీవారికి భారీ కానుకలిచ్చుకున్నారు. 
 
మరోసారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని వెంకన్నకు విరాళంగా ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించి, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాలని ముఖేష్ అంబానీ కోరారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఒకరిని తిరుమలకు పంపించి, విరాళాన్ని అందించారు. 
 
తిరుమలలోని దాతల విభాగంలో ఈ విరాళం చెక్కును అధికారులు స్వీకరించారు. గతంలోనూ ముఖేష్ అంబానీ పలుమార్లు వెంకటేశ్వరునికి కోట్లాది రూపాయలను విరాళంగా సమర్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments