Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం..?

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (13:14 IST)
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్టిందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. 2017లో హుండీ ఆదాయ వివ‌రాల‌ను ఓసారి పరిశీలిస్తే.. 2016 కంటే 2017 హుండీ ఆదాయం త‌గ్గింద‌ని తెలిపింది.
 
ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన నోట్ల ర‌ద్దేనని తెలుస్తోంది. ఏడాది మొత్తానికి రూ. 995.89 కోట్లు హుండీ ఆదాయం వ‌చ్చింది. ఈ  ఆదాయం.. 2016 ఆదాయం రూ. 1046.28 కోట్లతో పోల్చితే దాదాపు రూ. 50 కోట్లు త‌క్కువని తితిదే వెల్లడించింది. 
 
నోట్ల ర‌ద్దు త‌ర్వాత ర‌ద్దైన నోట్ల‌ను హుండీలో వేయ‌డం వ‌ల్ల ఆదాయం తగ్గిందని టీటీడీ అధికారుల అంచనా. ఇంకా ఆన్‌లైన్‌లోనే వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు పెరిగిపోతున్నాయని వారు అన్నారు. జీఎస్టీ ఎఫెక్ట్ కూడా హుండీ ఆదాయంపై పడిందని తితిదే అధికారులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

లేటెస్ట్

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

తర్వాతి కథనం
Show comments