Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా 2 గంటల్లోనే దర్శనం... కాలినడక భక్తులకు...

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం చాలా కష్టమన్నది చాలామందికి తెలుసు. సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు గంటల తరబడి కంపార్టుమెంట్లలో కూర్చోవాలి. నడక దారి నుంచి వచ్చిన భక్తులైతే కాళ్ళ నొప్పితోనే కంపార్టుమెంట్లలో వారు కూడా స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటార

Webdunia
బుధవారం, 19 జులై 2017 (15:09 IST)
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం చాలా కష్టమన్నది చాలామందికి తెలుసు. సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు గంటల తరబడి కంపార్టుమెంట్లలో కూర్చోవాలి. నడక దారి నుంచి వచ్చిన భక్తులైతే కాళ్ళ నొప్పితోనే కంపార్టుమెంట్లలో వారు కూడా స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటారు. 
 
అలాంటి పరిస్థితిని అధిగమించి భక్తులకు త్వరితగతిన దర్శనభాగ్యం లభించేందుకు నూతన తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వారాంతంలో కాలినడక దివ్యదర్శనం టోకెన్లను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత దివ్యదర్శనం టోకెన్లను కుదిస్తూ వచ్చారు.
 
గురు, శుక్ర, శనివారాల్లో అయితే పూర్తిగా రద్దు చేయాలనుకున్నప్పటికీ దివ్యదర్శనం టోకెన్లను తిరిగి ప్రారంభించారు. అది కూడా రెండు గంటల్లోనే కాలినడక భక్తులకు దర్శనం పూర్తయ్యేలా చూడనున్నారు. వారాంతంలో రద్దు చేసిన టిక్కెట్లను తిరిగి ఇవ్వనున్నారు. అది కూడా 20 వేల టోకన్లు మాత్రమే. 
 
అలిపిరి పాదాల మండం నుంచి నడిచి వెళ్లే భక్తులకు 14వేలు, శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తులకు 6 వేల టోకన్లను ఇవ్వనున్నారు. మొదట్లో తితిదే తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడినా ఆ తరువాత తప్పును సరిదిద్దుకుని టోకన్లను ఇవ్వడమే కాకుండా ఎంత రద్దీ ఉన్నా రెండు గంటల్లోనే స్వామివారి దర్శనాన్ని కల్పించే విధంగా తితిదే చర్యలు తీసుకోవడం భక్తుల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

అన్నీ చూడండి

లేటెస్ట్

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments