Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారదర్శకంగానే తితిదే నిధుల డిపాజిట్ : ఈవో అనిల్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి చెందిన నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు, ఈ వ్యవహారం అంతా పారదర్శకంగానే సాగినట్టు తితిదే ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. తితిదే నిధులు డిపాజిట్లలో అవకతవకలు జరిగినట

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (10:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి చెందిన నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు, ఈ వ్యవహారం అంతా పారదర్శకంగానే సాగినట్టు తితిదే ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. తితిదే నిధులు డిపాజిట్లలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. 
 
టీటీడీ నిధులను వివిధ బ్యాంక్‌లలో జమచేయడంపై వచ్చిన ఆరోపణలలో వాస్తవంలేదన్నారు. టీటీడీ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ నూచనలను అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల జాబితా ప్రకారం వచ్చిన సీల్డ్‌ బిడ్‌ కొటేషన్లను మార్చి 24వ తేది పరిశీలించామన్నారు. 
 
వచ్చిన కొటేషన్లను పరిశీలించి మరింత మెరుగైన వడ్డీ రేట్లను కోరుతూ మార్చి 26వ తేదీన మరోసారి బ్యాంకుల నుండి వచ్చిన సీల్డ్‌ బిడ్‌ కొటేషన్లను పరిశీలించినట్లు తెలియజేశారు. నిబంధనలను పాటిస్తూ టీటీడీకి అత్యధిక శాతం వడ్డి ఇవ్వడానికి అంగీకరించిన బ్యాంకులలో మాత్రమే జమ చేశామన్నారు.
 
ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి వడ్డీల రూపంలో వచ్చే రూ.4 వేల కోట్లలో రూ.3 వేల కోట్లను ప్రభుత్వరంగ బ్యాంకులలోనూ, రూ.1000 కోట్లను ప్రైవేట్‌ బ్యాంక్‌లలో డిపాజిట్‌ చేయాల్సి ఉందన్నారు. అందులోభాగంగా విజయా బ్యాంక్‌ 7.27 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 7.11 శాతం, ఆంధ్రా బ్యాంక్‌ 7.32 శాతం వడ్డీని ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. 
 
అధిక వడ్డీని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆంధ్రా బ్యాంక్‌లో రూ.3,000 కోట్లు (7.32 శాతం వడ్డ్డీకి), ఇండసిండ్‌ బ్యాంక్‌లో రూ.1,000 కోట్లను (7.66 శాతం) డిపాజిట్‌ చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 10,589 కోట్లు టీటీడీ నిధులను వివిధ బ్యాంకులలో డిపాజిట్‌ చేసినట్టు ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments