శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు సిద్ధం చేసిన తితిదే - తొలి 3 రోజులు వారికే..

Webdunia
గురువారం, 14 మే 2020 (16:02 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఫలితంగా గత 50 రోజులకు పైగా తిరుమల కొండపైకి భక్తులు ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. కేవలం తిరుమల గిరిపై నివాసిస్తున్న ఉద్యోగులు, తితిదే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17వ తేదీన లాక్డౌన్ ఎత్తివేసిన పక్షంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 
 
వీటిలోభాగంగా, తొలి మూడు రోజుల పాటు కేవలం తితిదే సిబ్బందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరుపతి, తిరుమల ప్రజలకు 15 రోజుల పాటు దర్శనం అందుబాటులోకి తెస్తారు. అదీకూడా ప్రయోగాత్మకంగా ఈ దర్శనం కల్పించనున్నారు.
 
అంతేకాకుండా, రోజుకు కేవలం 14 గంటల పాటు కేవలం 500 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ లెక్కన వారానికి 7 వేలు మంది మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఇతర భక్తుల కోసం దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విక్రయించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijay: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు.. టీవీకే కీలక సమావేశం

పొరపాటున ఇంటి మెయిన్ డోర్ తెరిచిన మహిళ... కాపలా ఉన్న డెలివరీ బాయ్

ఎస్ఆర్ఎం వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‍పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు

ఇప్పటికే నలుగురు సంతానం... మరో కాన్పులో ముగ్గురికి జన్మ

కూలీలతో వెళుతున్న వ్యాన్ - ఎస్.యు.వి వాహనం ఢీ .. 15 దుర్మరణం

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

తర్వాతి కథనం
Show comments