కొత్త వివాదంలో తితిదే - లవుడు ఒక్కడే.. కుశడు కాదా? (video)

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:45 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. తితిదే ఆధ్వర్యంలో ప్రచురితమయ్యే సప్తగిరి మాసపత్రికలో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని వక్రీకరిస్తూ కథనం ప్రచురితమైంది. సీతారాములకు ఒక్కరే కుమారుడని పేర్కొంది. సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. 
 
ఈ వార్త చూడగానే బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆగ్రహం వ్యక్త చేస్తూ, ఆందోళనకు దిగారు. తితిదే వంటి ధార్మిక సంస్థ వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతందని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై భక్తులు కూడా తితిదేపై మండిపడుతోంది.
 
ఇటీవలే తితిదే ఓ వివాదం నుంచి బయటపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి నిరర్ధక ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో తితిదే తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారు నగలతో పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం.. లో దుస్తులు, చెప్పులు కనిపించడంతో?

రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం

ఆర్థిక సర్వే: నివసించడానికి ఉత్తమ నగరాలు-తిరుపతి, వైజాగ్‌లకు స్థానం

అమరావతి ఆర్థిక ప్రాంతం కింద 9 జిల్లాలు.. పౌరులకు గుడ్ న్యూస్

విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే బడ్జెట్ : మంత్రి నాదెళ్ల మనోహర్

అన్నీ చూడండి

లేటెస్ట్

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

10-02-2026 మంగళవారం ఫలితాలు - ఆలోచించి ముందుకు సాగండి.. ఒత్తిళ్లకు గురికావద్దు...

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

తర్వాతి కథనం
Show comments