Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. ఏంటది..?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:52 IST)
శ్రీవారి భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం కూడా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ టిక్కెట్ ధర రూ.300. ఈ టిక్కెట్‌తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు. 
 
తిరుపతికి వెళ్లే దూరప్రాంత సర్వీసులకు ఈ సదుపాయం వర్తిస్తుందని, ప్రయాణ చార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి ఉదయం 11 గంటల స్లాట్‌లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్‌లో టికెట్లను ఎంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రోజుకు 1000 టిక్కెట్లను జారీచేస్తారు. 
 
ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్‌లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పైగా, వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments