Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరజ్ చోప్రాకు వెల్లువెత్తుతున్న బహుమతులు.. ఇండిగో ఏడాదిపాటు..?

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (21:28 IST)
Neeraj Chopra
టోక్యో ఓలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ కారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఆ జాబితాలో చేరింది. విశ్వ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ప్రయాణ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించింది.
 
మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పసిడి పతకాన్ని సాధించినందుకు గుర్తింపుగా ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు ఏడో తేదీ వరకు అపరిమితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. 
 
ఇండిగో సీఈవో కం హోల్‌టైం డైరెక్టర్ రొనోజోయ్ దత్తా ఈ సందర్భంగా స్పందిస్తూ.. నీరజ్ దేశానికి స్వర్ణ పతకాన్ని సంపాదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ విమానాల్లో మీరు ప్రయాణించడానికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అలాగే ఏడాది పాటు ఉచితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఇస్తామని వినయంతో తెలియజేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments