Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజ్లర్‌ ప్రాణాలు తీసిన వర్షపు నీరు.. ఎక్కడ?

వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (13:42 IST)
వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాంచీలో జైపాల్ సింగ్ స్టేడియాన్ని 1978 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యే ఆ రాష్ట్ర క్రీడాకారులు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అదేసమయంలో ఈ స్టేడియంలో వర్షపు వెళ్లేందుకు సరైన వసతులు లేవు. 
 
అయితే, తాజాగా భారీవర్షం కురవడంతో స్టేడియంలో వర్షం నీరు నిలిచింది. అదేసమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ నీటిలో విద్యుత్ ప్రవహించింది. ఈ విషయం తెలియని 25 ఏళ్ల రెజ్లర్ విశాల్ కుమార్ వర్మ స్టేడియంలోకి రోజువారీగా ప్రాక్టీస్ చేసేందుకు రాగా, విద్యుదాఘాతానికి గురై అపస్మారకంగా పడిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్టేడియం సిబ్బంది విశాల్ కుమార్ వర్మను అక్కడి వారు సర్దార్ ఆసుపత్రికి తీకుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలానాథ్ సింగ్ తెలిపారు.
 
విశాల్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష, ఆయన నలుగురు చెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకూ నెలకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కోచ్ భాలోనాథ్ సింగ్ చెప్పారు. అలాగే, కేంద్ర క్రీడా శాఖ నుంచి కూడా రూ. 10 లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments