కృష్ణాష్టమి : వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలమట!

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (15:58 IST)
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. 
 
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
 
"ఓ అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చుపెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును" అని చెప్పియున్నాడు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున వ్రతమాచరించి నిష్ఠతో ఆ దేవదేవుడిని పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మోనాలిసా మిస్సింగ్, రాజస్థాన్ అజ్మేర్‌కి వచ్చాక మిస్ అయ్యిందంటూ భర్త పోస్ట్

పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... భారత్‌కు వచ్చిన చమురు ట్యాంకర్లు

చర్లపల్లి టెక్కీ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ - అత్తమామలు - బామ్మర్ది వేధింపులు తాళలేక...

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి

పునర్విభజన పేరుతో రాజ్యాంగంపై దాడి : సోనియా గాంధీ

అన్నీ చూడండి

లేటెస్ట్

జ్యోతిష్య శాస్త్రం: హనుమంతుడి దగ్గరయ్యే ఆ మూడు రాశులేవి?

చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..

09-04-2026 గురువారం ఫలితాలు - పోయానుకున్న వస్తువులు..?

చైత్ర సప్తమి రోజున ఇలా పూజిస్తే.. అన్నదానం, సూర్యపూజ చేస్తే..?

08-04-2026 బుధవారం ఫలితాలు- మాటతీరు అదుపులో ఉంచుకోండి

Show comments