ఈ స్వీట్ పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుని తింటారంతే...

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:18 IST)
కరోనావైరస్ కారణంగా ఇపుడు బయట స్వీట్ షాపుల్లో ఏమి తినాలన్నా భయంగా వుంటుంది. అందువల్ల చక్కగా ఇంట్లోనే స్వీట్ పదార్థాలను తయారు చేసి పిల్లలకి పెడుతుంటే టేస్టీగా లాగించేస్తారు. ముఖ్యంగా కొబ్బరి తురుముతో చేసిన మైసూర్ పాక్ సూపర్ టేస్టీగా వుంటుంది. అదెలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి- ఒక కప్పు, 
కొబ్బరితురుము- ఒక కప్పు
పాలు- ఒక కప్పు,
నెయ్యి- ఒక కప్పు,
పంచదార- రెండు కప్పులు,
జీడిపప్పు- కొద్దిగా
 
తయారుచేసే విధానం : 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చిన్నచిన్న సమభాగాలు కట్‌ చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సైకిళ్లు - గుర్రాలపై వెళ్లాల్సి వస్తుంది : ఆక్రమణలపై బాంబే హైకోర్టు వ్యాఖ్యలు

దిగ్విజయంగా సంకల్ప్ యాత్ర.. సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

కృత్రిమమేథతో వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రమాదం : మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తాఫా సులేమాన్

వాట్.. శీనూ ది గ్రేట్... ఫ్యామిలీ రచ్చ ఎందుకబ్బా... దువ్వాడతో జగన్ వ్యాఖ్యలు

సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natural Star Nani,: ది ప్యారడైజ్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ డేట్ ప్రకటన

Manasa Varanasi: ప్రొఫెషనల్ గా ఉండాలనే ముద్దు సీన్స్ లో నటించా : మానస వారణాసి

Mahesh Babu: శివరాత్రి రోజు నాగబంధం టీజర్ ను లాంచ్ చేయనున్న మహేష్ బాబు

అడివి శేష్ దర్శకత్వంలో అకీరా నందన్

Arjun: ఇక్కడ కక్ష సాధింపులుండవు - పవన్ కళ్యాణ్ గారు మేం ఉన్నాం అన్నారు : యాక్షన్ కింగ్ అర్జున్

తర్వాతి కథనం
Show comments