Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికలు : నేటితో ప్రచారం పరిసమాప్తం

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (09:14 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. దీంతో చివరి రోజైన బుధవారం అన్ని రాజకీయ పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. 13 నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తికానుంది. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రచారం నేటితో ముగియనుంది. 
 
బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించకూడదు. ఛానెళ్లలో ఒపీనియన్‌ సర్వేలు, ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను నిషేధించారు. పోలింగ్‌ జరిగే ప్రాంతంలో వినోద కార్యక్రమాలకు కూడా అనుమతివ్వలేదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. లేదంటే రెండూ విధించొచ్చన్నారు. ఈ నిబంధనలను విధిగా అమలు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల పోలింగ్ ఈనెల 7వ తేదీ శుక్రవారం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments