Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరేయ్ అల్లుళ్లూ, మీ మావయ్యతో వేగలేకపోతున్నా, అతణ్ణి చంపేయండి

ఐవీఆర్
శుక్రవారం, 8 మార్చి 2024 (19:01 IST)
కొందరు భర్తలు ప్రతి చిన్న విషయానికి భార్యలను వేధిస్తుంటారు. ఆ గొడవలు ఎలా వుంటాయంటే... నవ్వుతున్నావేంటి, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, వాళ్లను ఎందుకు చూస్తున్నావు, ఫలానా వ్యక్తి నిన్నే ఎందుకు చూస్తున్నాడు... వంటి వేధింపులు చాలానే వుంటాయి. ఐతే వీటిని కొందరు భరిస్తుంటారు కానీ మరికొందరు ఆ వేధింపులను తాళలేక క్రూరంగా మారిపోతుంటారు. అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 45 ఏళ్ల మస్నాజీ నిత్యం తన భార్యను ఏదో వంకతో వేధిస్తుండేవాడు. చీటికిమాటికి గొడవపడుతూ దండిస్తుండేవాడు. ఈ బాధ భరించలేని బాధితురాలు తన ఇద్దరు మేనళ్లులకు మొరపెట్టుకున్నది. మావయ్య వేధింపులను భరించలేకపోతున్నాననీ, అతడి అడ్డు తొలగించండి అని చెప్పడంతో వారిరువురూ మరో వ్యక్తిని తోడు తీసుకుని మస్నాజీపై దాడి చేసారు. ఇనుప రాడ్లు, కర్రలతో బలంగా మోదడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments