Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (15:18 IST)
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ విమానంలో విషపూరిత పాములను విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఈ విషపూరిత పాములను ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ వెంట తీసుకొచ్చినట్టు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇలా పాములు కనిపించడం ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. 
 
అధికారులు జరిపిన తనిఖీల్లో పాములు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి ఎందుకు తీసుకొచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అధికారులు అనకొండ పిల్లలుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మకు బ్రెయిన్ వాష్ చేశారు : మంచు మనోజ్ (Video)

అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి నుంచి దేశీ రాజుగా విక్రమ్ ప్రభు గ్లింప్స్

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో కిల్లర్ పార్ట్ 1

విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ ఆవిష్కరించిన డియర్ కృష్ణ ట్రైలర్

'పుష్ప-3'పై కీలక అప్‌డేట్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments