Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు జలసమాధి (Video)

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు చెరువులో మునిగిపోవడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా, పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంతో వెళుతున్న కారు నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు చెరువులోని నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు జలసమాధి అయ్యారు. ఒకరు మాత్రం చెరువు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను వెలికి తీసి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్‌కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీలుగా గుర్తించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments