Webdunia - Bharat's app for daily news and videos

Install App

KCR in Assembly: కేసీఆర్ అసెంబ్లీకీ రావాలి.. రేవంత్ రెడ్డి

సెల్వి
ఆదివారం, 8 డిశెంబరు 2024 (10:20 IST)
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. బీజేపికి 8, ఎంఐఎం పార్టీకి 7, సీసీఐ ఒక్క స్థానాల్లో విజయం సాధించింది.
 
గత యేడాది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపారు. ఇప్పటికే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలపై గొంతెత్తుతుంది. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన సహా పలు అంశాలపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలపై అందరి దృష్టి కేసీఆర్‌పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకీ వస్తారా లేదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
గత అసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ హాజరు కాలేదు. దీంతో తాజాగా కేసీఆర్ అసెంబ్లీకీ రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments