12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (09:19 IST)
ఈ నెల 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరుగనుంది. ఈ సందర్భంగా మేడారం వనదేవతులు సమ్మక్కసారలమ్మకు ప్రత్యేక పూజలు చేసేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతరకు 10 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ఆమె సంబంధిత అధికారులతో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. 
 
ముఖ్యంగా, జాతర సమయంలో గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాటలు, చోరీలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ప్రధానంగా జంపన్నవాగు, గద్దెల ప్రాంత, మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చినా పార్కింగ్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments