Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (17:59 IST)
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిరావు పూలె ప్రజాభవన్‌గా మార్చిన విషయం తెల్సిందే. ఇదే భవనంలోనే ప్రజాదర్బార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ఇపుడు ఈ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం మల్లు భట్టివిక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించింది. 
 
మరోవైపు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం భవన అన్వేషణ చేస్తున్నారు. భాగ్యనగరిలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు భద్రతాపరంగా అనుకూలంగా ఉంటుందని, వాహనాల పార్కింగ్‌కు కూడా సౌలభ్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయంగా ఈ భవనాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments