తెలంగాణాలో భారీ వర్షాలు... పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (10:24 IST)
తెలంగాణాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కరీం నగర్, జగిత్యాల యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అధికారులు గురువారం సెలవు ప్రకటించారు. ముఖ్యంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 
 
యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిగా వచ్చే నెల రెండో శనివారం పాఠశాలల పనిదినంగా అధికారులు ప్రకటించారు. మరోవైపు, యాదాద్రి జిల్లాలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
భారీ వర్షాలు, వరదలతో ప్రజలకు ఇబ్బందులు కలగడంపై భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలలతో ఆయన ఫోనులో మాట్లాడి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని కేటీఆర్‌ను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments