Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో గంటకు ఎన్ని కరోనా కేసులు నమోదంటే...

Webdunia
సోమవారం, 13 జులై 2020 (11:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తన విశ్వరూపాన్నిచూపిస్తోంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంది. ఫలతింగా ప్రతి గంట వ్యవధిలో కొత్తగా 49 మంది వైరస్ బారినపడుతున్నారు. అంటే రోజులో సగటున 1169 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వస్తున్నాయి. 
 
వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో ఉన్న తీవ్రత ఇప్పుడు కనిపించకపోయినా, కొత్త కేసుల సంఖ్య అధికంగానే ఉందని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నెల 3 నుంచి 8 మధ్య రోజుకు 1,270 నుంచి 1,660 వరకూ కేసులు రాగా, ఆపై మాత్రం రోజుకు 1,000 కేసుల లోపే వస్తున్నాయి. 
 
తొలివారంలో రికార్డు స్థాయిలో నమోదైన కేసుల వేగం, ఇప్పుడు దాదాపు సగానికి తగ్గింది. మొత్తం మీద గత 13 రోజుల్లో ఏకంగా 14,033 కేసులు వచ్చాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై, కంటెయిన్ మెంట్ జోన్లలో ఆంక్షలను పెంచారు.
 
మరోవైపు, ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో 1269 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎనిమిది మంది చనిపోయారు. 
 
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 800 కేసులు నమోదుకాదా. రంగారెడ్డిలో 132, మేడ్చల్‌లో 94, సంగారెడ్డిలో 36, కరీంనగర్‌లో 23, పాలమూరులో 17, వరంగల్ అర్బన్‌లో 12 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 11883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments