Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషపూరిత ఇంజెక్షన్ వేసుకుని వరంగల్ ఎంజీఎం వైద్యురాలు సూసైడ్ అటెంప్ట్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వంరగల్ జిల్లా కేంద్రంలో ఉన్న మహాత్మా గాంధీ వైద్య కాలేజీకి చెందిన వైద్యురాలు ఒకరు విషపూరిత ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎంజీఎం వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ధృవీకరించారు. 
 
కాకతీయ వైద్య కాలేజీలో పీజీ అనస్తీషియాగా విద్యాభ్యాసం చేస్తున్నా డాక్టర్ ధరవాత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున సూసైడ్ అటెంప్ట్ చేశారు. విధుల్లో వున్నపుడు ఆమె హానికరమైన ఇంజెక్షన్ వేసుకున్నారు. దీన్ని తోటి వైద్యులు గుర్తించి ఆమెకు అత్యవసర సేవల విభాగానికి తరలించి చికిత్స అందించారు. 
 
అయితే, ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించి విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ధృవీకరించారు. రెండు రోజుల క్రితం డాక్టర్ ప్రీతిని సీనియర్ వైద్యులు వేధించారన్న ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై ప్రీతి ఫిర్యాదు మేరకు సీనియర్ వైద్యులను కూడా ప్రిన్సిపల్ మందలించినట్టు సమాచారం. అయినప్పటికీ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments