Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి సజీవ దగ్ధమైంది...

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (20:11 IST)
పగలంతా వళ్లంతా అలసిపోయేట్లు పనిచేసి హాయిగా సేదతీరారు ఆ దంపతులు తమ కుమారిడితో సహా. ఐతే అర్థరాత్రి వున్నట్లుండి వారిపైకి అగ్నికీలలు వచ్చిపడ్డాయి. నిద్రలేచి తేరుకునేలోపే ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి ఆహుతైంది.

 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో నర్సింహులు అతడి భార్య మంగమ్మ, వారి కొడుకు నివాసం వుంటున్నారు. నిన్న రాత్రి అంతా ఇంట్లో నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటాక ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పూరిల్లు కావడంతో ఇంటిని క్షణాల్లో అగ్ని చుట్టుముట్టింది.

 
ఏం జరిగిందో తెలుసుకునేలోపే వారిని మంటలు చుట్టుముట్టాయి. హాహాకారాలు విని పొరుగుంటి వారు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేసారు. నర్సింహులు, అతడి కుమారుడిని ఎలాగో బయటకు లాగారు కానీ నర్సింహులు భార్య మంగమ్మను మాత్రం కాపాడలేకపోయారు. ఆమె మంటల్లో చిక్కుకుని సజీవంగా దహనమైంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments