Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల కేసు : నిందితుల విడుదల

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:40 IST)
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కేసులో నిందితులను రిమాండ్‌కు పంపించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. లంచాలు ఇవ్వజూపినట్టు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది. పైగా, స్వాధీనం చేసుకున్న డబ్బు ఎంతో కూడా పోలీసులు స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేసింది. లంచం సొమ్ము దొరకనందున పీసీ యాక్ట్ వర్తిందని, అందువల్ల నిందితులను తక్షణం విడిచిపెట్టాలని గత రాత్రి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. 
 
తెరాస ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో అరెస్టు అయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం వారిని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది, అలాగే, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత విచారించిన న్యాయమూర్తి జి.రాజగోపాల్ పోలీసులను ఆదేశించారు. 
 
అరెస్టు సందర్భంగా లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని పేర్కొన్నారు. ప్రలోభాల కేసులో అరెస్టు అయిన నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గురువారం రాత్రి సరూర్ నగర్‌లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని విడిచిపెచ్చినట్టు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments