Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలింది.. రూ.7లక్షల ఆస్తి నష్టం.. ఎక్కడంటే?

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (10:16 IST)
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ బైకులు అక్కడక్కడా పేలిపోవడం వినేవుంటాం. అయితే తాజాగా దుబ్బాకలో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలడంతో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఏడు లక్షల రూపాయల ఆస్తి నష్టం ఏర్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. చీకోడ్‌ గ్రామానికి చెందిన బీడీ టేకేదారు పుట్ట లక్ష్మీనారాయణ ఆరు నెలల క్రితం రూ.80 వేలు పెట్టి ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా తన ఇంటి ఎదురుగా ఉండే బొందనగారి దుర్గయ్య ఇంట్లో తన బైక్‌కు చార్జింగ్‌ పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో ఈ బైక్ బ్యాటరీ పేలిపోయింది. భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు జడుసుకున్నారు. 
 
చార్జింగ్‌ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఎలక్ట్రిక్‌ వాహనం దగ్ధం కాగా దుర్గయ్య ఇంటికి నిప్పంటుకోవడంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు వాపోయారు. ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిద అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments