కేఏ పాల్‌పై దాడి: పాల్‌పై చెంపదెబ్బ..

Webdunia
సోమవారం, 2 మే 2022 (19:44 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
కేఏ పాల్‌ వస్తున్నారనే సమాచారంతో ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామం వద్ద ఆయన్ని అడ్డుకున్నారు. 
 
డీఎస్పీ పక్కనే ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి పాల్‌పై దాడి చేశాడు. పాల్‌ చెంపపై కొట్టాడు. ఇక, వెంటనే అప్రమత్తమైన ఆయన అనుచరులు అతడిని అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసుల ఎదుటే టీఆర్ఎస్‌ శ్రేణులు నాపై దాడి చేశారని మండిపడ్డారు కేఏ పాల్.. పోలీసులు మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక టీఆర్ఎస్‌ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: లెనిన్ ప్రమోషన్ల హడావిడి మధ్యలో సరదా క్షణాలతో అక్కినేని నాగార్జున

Samudra: ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు - ఎఫ్.డి.సి డైరెక్టర్ సముద్ర

Allari Naresh : ఆల్కహాల్ తో అల్లరి నరేష్ పుట్టినరోజు జరుపుకుంటే రంభ ఊర్వశి మేనక వచ్చారు

Adivi Sesh : జూలైలో జి 2 షెడ్యూల్ చాలా ప్రత్యేకమైందంటున్న అడివి శేష్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

తర్వాతి కథనం
Show comments