Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డోర్స్ లాక్... ఊపిరాడక ప్రాణం విడిచిన ఇద్దరు చిన్నారులు

Webdunia
బుధవారం, 24 జులై 2019 (19:24 IST)
నిజామాబాద్ ముజాహిద్ నగర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు కారులో ఎక్కి ఊపిరాడక చనిపోయారు. రియాజ్‌ (10), మొహమ్మద్‌ బద్రుద్దీన్‌ (5) ఇద్దరూ అక్కాచెల్లెళ్ల పిల్లలు. ఈ పిల్లలు మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి కాలనీలో పార్క్‌ చేసి ఉన్న కారు వెనుక సీట్లో ఎక్కి కూర్చున్నారు. 
 
అప్పటికే కారు అద్దాలు మూసి ఉండటంతో ఒక్కసారిగా కారు డోర్లు లాక్‌ అయ్యాయి. దీంతో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. పిల్లల జాడ తెలియకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి  తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకినా లాభం లేకపోయింది. 
 
ఇంతలో కారు యజమాని ఇద్దరు చిన్నారులు మృతదేహాలను కారులో గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం డోర్ లాక్ చేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments