Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలాన్లు రెట్టింపు కావు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (08:57 IST)
సెప్టెంబర్ 1వ తేదీనుంచి పెండింగ్ లో ఉన్న చలాన్లు రెట్టింపు అవుతాయంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్త ఫేక్ న్యూస్ అని చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అది పూర్తిగా తప్పుడు వార్త అనీ.. పుకార్లను నమ్మొద్దని చెప్పారు.
 
“వాహనదారులకు విజ్ఞప్తి. మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను ఈనెల ఆఖర్లోగా అనగా 31-08-2019లోగా చెల్లించండి. లేనిచో.. 01-09-2019 నాటికి కొత్త చట్టం ప్రకారం సాఫ్ట్ వేర్ అప్ డేషన్ అయిన వెంటనే.. పాత జరిమానాలు అన్నీ ఆటోమేటిక్ గా కొత్త ధరలతో రెట్టింపు చేయబడును- కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ వింగ్, హైదరాబాద్ , తెలంగాణ” అంటూ.. వాట్సప్, ఫేస్ బుక్ లలో తిరుగుతున్న న్యూస్ ను ఎవరూ నమ్మొద్దని.. ఫేక్ న్యూస్ ను షేర్ చేయొద్దని కోరారు.
 
 సెప్టెంబర్ 1వ తేదీనుంచి … ఇప్పటికే చలాన్లు కట్టనివారికి కొత్త నిబంధనల ప్రకారం బిల్లులు మారిపోతాయన్న ప్రచారాన్ని సర్క్యులేట్ చేయొద్దన్నారు. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి ఆ బిల్లులు అలాగే ఉంటాయని.. కొత్త చట్టం అమలులోకి వస్తే.. ఆ చట్టం ప్రకారం అప్పటినుంచి చలాన్లు నమోదవుతాయని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments