Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండెక్కిన చికెన్ ధరలు - 20 రోజుల్లో రూ.100 పెరుగుదల

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (13:53 IST)
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత 20 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.100 మేరకు పెరిగాయి. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయని చికెన్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 10 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం లేదా పండుగ రోజుల్లో ఇది 15 లక్షల కేజీల వరకు ఉంటుంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. 
 
ఫలితంగా గత 20 రోజులుగా చికెన్ విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజుకు 2 లక్షల కేజీల వరకు చికెన్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో పాటు కోళ్ళ కొరత ఏర్పడుతుంది. ఈ కారణాలన్నింటి కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో సూర్యతాపం పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా కోడి పిల్లలు మృత్యువాతపడుతున్నాయి. దీనికితోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా వంటి ధరలూ పెరిగిపోయాయి. 
 
మరోవైపు నాటుకోడి ధర కేజీలో రూ.400 నుంచి రూ.500కు పెరిగింది. ప్రస్తుతం నాటుకోళ్ళ లభ్యత చాలా తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments