బోరు బావిలో పడిన చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:10 IST)
మెదక్‌ జిల్లాలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్‌ మృతిచెందాడు. దాదాపు 17 అడుగుల లోతులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రెస్క్యూ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు.

అయితే అప్పటికే చిన్నారి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బోరు వేసిన అరగంటకే మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్‌ బోరుబావిలో పడ్డాడు. పాపన్న పేట మండలంలో సాగుకోసం పంటపొలంలో బోరు వేశారు. అయితే వెంటనే కేసింగ్‌ ఏర్పాటు చేయలేదు.

దీంతో ఆటలాడుకుంటున్న మూడేళ్లచిన్నారి సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

బాలుడిని వీలైనంత త్వరగా బావి నుండి బయటకు తీసేందుకు యత్నించారు. దాదాపు 12 గంటలపాటు రెస్క్యూ నిర్వహించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మన్నీరు అయ్యారు. ఆ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. స్థానికులందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments