Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడుకి రాజ్యసభ సీటు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (17:33 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సమావేశంలో ఆయన అన్ని విషయాలపై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశం అనంతరం తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్) పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్లు వేయనున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. 
 
కాగా, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో జోగినపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్‌కు సంతోష్ కుమార్ సన్నిహితంగా ఉంటున్నారు. ప్రస్తుతం తెరాస ప్రధాన కార్యదర్శిగా, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‍గా పని చేస్తున్నారు. అలాగే, పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments