Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (07:20 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పర్యటించనున్నారు. నిజానికి కొండగట్టుకు మంగళవారమే వెళ్లాలని నిర్ణయించారు. కానీ, మంగళవారం ఆలయ క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు చెప్పడంతో ఆయన తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటన కోసం సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి, బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో కొండగట్టుకు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటారు. ఇందుకోసం కొడిమ్యాల మండలోని నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు.
 
కాగా, తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం అత్యంత  వైభవంతో పునర్ నిర్మించిన విషయం తెల్సిందే. అదే విధంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఆయన రూ.100 కోట్లు కేటాయించారు. పైగా, యాదాద్రి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలను కూడా అప్పగించినట్టు సమాచారం. ఇందులోభాగంగా, ఆనంద్ సాయి ఇటీవల కొండగట్టు క్షేత్రంలో పర్యటించి అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments