Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్.. సీఎం అనే పదాన్ని కమీషన్ మ్యాన్‌గా మార్చేశారు- ఖుష్భూ

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (15:24 IST)
తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త ఖుష్బూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో కవితకు మాత్రమే భరోసా వుందని, మహిళల కోసం ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదని, మహిళా వ్యతిరేత ప్రభుత్వం ఇదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేయలేదన్నారు. 
 
టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఖుష్బూ ధ్వజమెత్తారు. వరంగల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఖుష్బూ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్.. సీఎం అనే పదాన్ని కమీషన్ మ్యాన్‌గా మార్చేశారని.. విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పాలని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 
 
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. ఓ మహిళ విద్యను అభ్యసిస్తే.. ఆ ఇళ్లే విద్యను అభ్యసించినట్లు అవుతుందని నమ్మారని.. అలాంటి కాంగ్రెస్ పార్టీ, ఓ మహిళను ప్రధానిని చేసిందని, రాష్ట్రపతిని చేసిందని, స్పీకర్‌ పదవిని ఇచ్చిందని ఖష్బూ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments