Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నెపోటిజం వుంది.. పేరు చెప్పకుండా కేసీఆర్‌ని ఏకేసిన పీఎమ్

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (14:20 IST)
తెలంగాణలో 11,300 కోట్ల విలువైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అధికారిక కార్యక్రమాలను దాటవేసి, విమానాశ్రయంలో ప్రధానిని స్వాగతించలేదు. 
 
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కొద్ది మంది ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో అవినీతిని, బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నారని ప్రధాని ఆరోపించారు. 
 
ప్రతి ప్రాజెక్టులోనూ తమ కుటుంబ ప్రయోజనాల కోసం చూస్తున్నారని కేసీఆర్‌ పేరు చెప్పకుండా మోదీ అన్నారు. తెలంగాణలో మెట్రో ప్రాజెక్టు, రూ.15,000 కోట్లతో 5,000 కి.మీ జాతీయ రహదారి చేరికతో సహా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవినీతి, బంధుప్రీతిపై పోరాడేందుకు తెలంగాణ ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments