Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మృతులు.. ఐదు రూపాయలకే దహన సంస్కారాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 మే 2021 (12:16 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారికి ఐదు రూపాయలకే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో రెండు ఎకరాల స్థలంలో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
 
త్వరలోనే శ్శశాన వాటిక పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుందన్నారు. మునిసిపల్ కమిషనర్‌కు రూ. 5 చెల్లించడం ద్వారా అక్కడ అంత్యక్రియలు చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పారు.
 
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. పదివేలకు వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు.. లాక్‌డౌన్‌లో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2242 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తాజాగా 19 మంది మృతి చెందినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,53,277కు చేరగా, మొత్తం మరణాల సంఖ్య 3,125కు చేరింది. తాజాగా రికవరీ కేసుల సంఖ్య 4693 ఉండగా, ఇప్పటి వరకు 5,09,663 రికవరీ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments