Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదీ కేసీఆర్ దెబ్బంటే... కోదండరామ్ ఇక ఒంటరే... టీజేఏసీలో లుకలుకలు...

తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్. ఉద్యమ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆయన జైత్రయాత్ర సాగుతోంది. తెలంగాణలో విపక్షాలు ఏ సమస్యపై మొరపెట్టుకున్నా... వాళ్ల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (14:24 IST)
తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్. ఉద్యమ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆయన జైత్రయాత్ర సాగుతోంది. తెలంగాణలో విపక్షాలు ఏ సమస్యపై మొరపెట్టుకున్నా... వాళ్ల మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ప్రొ.కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై సమరశంకం పూరించారు. ఐతే ర్యాలీ నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీనితో టీజేఏసీ కోర్టుకెక్కింది. 
 
నాగోల్‌లో ర్యాలీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఐతే కోదండరాం దీనికి విముఖత తెలిపారు. నగరంలోనే ర్యాలీ నిర్వహించాలని మొండికేశారు. దీనిపైనే ఇపుడు టీజేఏసీలో రచ్చ అయింది. కోదండరాం నిర్ణయంపై జేఏసీ కన్వీనర్ రవీందర్ అసహనం వ్యక్తం చేశారు. బాహాటంగా విమర్శలు చేశారు. ఆయనతోపాటు మరికొందరు గళం కలిపారు. మొత్తమ్మీద ర్యాలీ చేసి గంటలు కూడా కాకమునుపే జేఏసీలో లుకలుకలు చూస్తుంటే కేసీఆర్ అంటే మజాకా అని అర్థమవుతుంది కదూ. భవిష్యత్తులో ఇక కోదండరాం ఒంటరిగా మిగులుతారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments