Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఠాగూర్" సినిమా సీన్ రిపీట్ - చనిపోయిన గర్భణీ చికిత్స.. ఎక్కడ?

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (10:42 IST)
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఠాగూర్". ఇందులో చనిపోయిన వ్యక్తి (శవం)కి ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల పాటు వైద్యం చేసిన సన్నివేశం ఉంది. ఇపుడు అచ్చం అలాంటి సీన్ ఒకటి ఇపుడు రిపీట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ నెలలు నిండటంతో ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడామెకు వైద్యం చేసిన తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయితే, కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు లోనైంది. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టిన వైద్యులు.. ఆమెకు మరింత మెరుగైన వైద్యం చికిత్స అందించాల్సివుందని నమ్మించి అదే రోజు రాత్రి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడామెకు వైద్యం అందిస్తున్నట్టుగా చెబుతూనే ఆమె కోలుకుంటుందని బంధువులను నమ్మించారు. 
 
ఆ తర్వాత తమ ప్రయత్నం ఫలించలేదని, అందుకే ఆమె చనిపోయిందని తాపీగా వెల్లడించారు. దీంతో బంధువులకు అనుమానం వచ్చి బాధితులు గొడవకు దిగడంతో ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చింది. గొడవ మరింత పెద్దదై బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యుతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.8 లక్షల ఇస్తామని ఒప్పందం రాసిచ్చినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments