Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై అఘాయిత్యాలు: డీజీపీకి లేఖ రాసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (18:51 IST)
రాష్ట్రంలోని విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలను నేర్పించేందుకు షీ టీమ్స్ ద్వారా ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి డీజీపీకి లేఖ రాశారు. విద్యార్థినులపై అఘాయిత్యాలు, దాడులు జరుగకుండా సరైన అవగాహనా కల్పించాలని డీజీపీకి సూచించారు.

పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని విద్యాశాఖా అధికారులను ఆదేశించారు. సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అనే విషయంపై విద్యార్థినులను చైతన్యపరచాలని మంత్రి కోరారు. షీ-టీమ్స్‌పై  అవగాహన పెంపొందించాలని సూచించారు. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. వేధింపులకు గురవుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోరారు. వాట్సాప్, కంట్రోల్ రూమ్, షీ-టీమ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments