Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కేసీఆర్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ!

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:59 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీ చేసి తన ఉనికిని చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్‌కు ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆంధ్రాలో ఆ పార్టీ రాష్ట్ర పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఎన్నికల సింబల్స్ ఆర్డర్ 1968 పేరా 6 ప్రకారం ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
సాధారణంగా రాష్ట్ర పార్టీగా గుర్తింపుపొందాలంటే ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లుకానీ, మొత్తంగా అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లుగాని సాధించివుండాలన్న నిబంధన ఉంది. అటు 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చివుండాలి. ఈ ప్రకారంగా చూస్తే ఏపీలో బీఆర్ఎస్‌ ఒక్కసారిగా కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణాలో మాత్రం బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ తన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments