Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటల పాదయాత్ర : 23 రోజులు 270 కిలోమీటర్లు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (11:13 IST)
ఇటీవల కాషాయం కండువా కప్పుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన సొంత నియోజక వర్గం హుజురాబాద్ లో జరగబోతున్న ఈ పాదయాత్ర  క‌మ‌లాపూర్ మండ‌లంలోని బ‌త్తినివానిప‌ల్లి నుంచి ప్రారంభిస్తున్నారు. 
 
బ‌త్తినివానిప‌ల్లిలోని ఆంజ‌నేయుని దేవ‌స్థానంలో సోమవారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఆయన శ‌నిగ‌రం, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీరాముల‌పేట‌, అంబ‌ల గ్రామాల్లో పాద‌యాత్ర చేయ‌నున్నారు. రాత్రికి అంబ‌ల గ్రామంలో బ‌స చేయనున్నారు. మొత్తం 23 రోజుల పాటు 270 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర జరగనుంది.
 
కాగా, ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన హుజురాబాద్ స్థానానికి జరిగే ఉపఎన్నికలను అటు తెరాస, ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా, ఈ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments