Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురి కిడ్నాప్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జితేందర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో నలుగురు కిడ్నాప్‌కు గురయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉండే వారిలో ఏకంగా నలుగురు కిడ్నాప్‌కు గురికావడం ఇపుడు కలకలం రేపుతుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైనవారిలో జితేందర్ రెడ్డి కారు డ్రైవర్‌తో సహా నలుగురు ఉన్నారు. ఈ కిడ్నాప్ ఘటనపై జితేందర్ రెడ్డి ఢిల్లీ ఫిర్యాదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ సౌత్ అవెన్యూలోని 105 నంబరు ఇంటిలో జితేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని పోలీస్ స్టేషనుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments