Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం: జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (11:58 IST)
గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి చెందారు. కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్డులో చోటుచేసుకుంది. 
 
శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మానస (22), మానస (21)గా గుర్తించారు. వీరితో పాటు డ్రైవర్‌ అబ్దుల్లా మృతి చెందాడు. మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు విజయవాడకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగి అబ్దుల్‌ రహీం కూడా మరణించాడు.
 
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సిద్ధూను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments